హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఇటీవల అమెరికాలో హనుమకొండకు చెందిన శ్వేత గుండెపోటుతో మృతి చెందగా.. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవతో ఆమె మృతదేహాన్ని బుధవారం ఆమె స్వదేశానికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ వికాస్నగర్కు చెందిన ఏఎన్ఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కే లక్ష్మారెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె శ్వేత. ఆమె భర్త సురేశ్రెడ్డి, ఇద్దరు పిల్లలతో కాలిఫోర్నియాలో నివసిస్తూ, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు.
ఈ నెల 8న శ్వేత గుండెపోటుతో మృతి చెందింది. దీంతో ఆమె పార్థివదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బంధువులు ఎంపీ వద్దిరాజు రవిచంద్రను కోరారు. స్పందించిన ఆయన హోంమంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు. హోంమంత్రి అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులను ఆదేశించడంతో శ్వేత మృతదేహం హనుమకొండకు చేరింది. శ్వేత అంత్యక్రియలను స్థానిక పద్మాక్షిగుట్ట శ్మశానవాటికలో నిర్వహించారు.