మదనాపురం, ఆగస్టు 9: మొసలి నోటికి చిక్కిన మత్స్యకారుడు త్రుటిలో ప్రాణాలతో బయటపడిన ఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్ర కారం.. గోపన్పేటకు చెందిన మత్స్యకారుడు మహేశ్ ఆదివారం రామన్పాడు జలాశయంలో చేపల వేటకు వెళ్లాడు.
చేపలు పడతుండగా మొసలి అతనిపై దాడి చేసింది. కుడికాలి పాదాన్ని నోటి తో గట్టిగా పట్టుకోగా.. మహేశ్ భయపడకుండా తన ఎడమకాలితో బలంగా మొసలిని తన్నాడు. దీంతో కుడి కాలిని విడిచిపెట్టిన మొసలి.. తన తోకతో ఎడమకాలిపై దాడిచేసింది. మహేశ్ త్రుటిలో తప్పించుకొని తోటి మత్స్యకారుల సా యంతో ఆత్మకూరు ప్రభుత్వ దవాఖానకు చేరుకున్నాడు.