వరంగల్ : వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సోషల్ మీడియాలో సీనియర్లపై కామెంట్స్ చేసిన థర్డ్ ఇయర్ విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ కమిటీ చర్యలకు సిఫారసు చేసింది. వాటిని కళాశాల అమలు చేసింది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం వాట్సాప్ గ్రూప్లో సీనియర్లపై కామెంట్ చేశారని ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో థర్డ్ ఇయర్ విద్యార్థులు మోకాళ్లపై కూర్చోబెట్టారు.
బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీకి పిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కమిటీ విచారణ చేపట్టి కారకులను మూడు నెలల అకడమిక్ సస్పెన్షన్, శాశ్వత హాస్టల్ వసతిని రద్దు చేస్తూ చర్యలకు సిఫారసు చేసింది. కమిటీ సిఫారసులను కళాశాల అమలు చేసింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.