పెద్దపల్లి : ప్రొటోకాల్( Protocol) నిబంధనలు విస్మరించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెద్దపల్లి జిల్లాలోని రామగిరి(Ramagiri) ఎంపీడీవో(MPDO )ఐ.రమేష్ను సస్పెండ్(Suspend )చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కమాన్పూర్లో పనిచేస్తున్న ఎంపీడీఓ రమేష్ డిప్యూటేషన్ పై రామగిరిలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాటించాల్సిన ప్రొటోకాల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడని కలెక్టర్ తెలిపారు.
రమేష్ తన కార్యాలయ విధుల్లో సైతం గౌరవపూర్వకంగా వ్యవహరించడం లేదని చెప్పారు. అనేక మార్లు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికి పట్టించుకోలేదన్నారు. జనవరి 31న జరిగిన కార్య క్రమంలో సైతం శిలాఫలకంలో ప్రోటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పాత తేదీతో ఉన్న శిలాఫలకం పెట్టి బాధ్యతారహితంగా ప్రవర్తించాడు. దీంతో షోకాజ్ నోటీసులు జారీ చేసిన తర్వాత సదరు ఎంపీడీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారలు తెలిపారు.