జనగామ, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజకవర్గంలో మరికొన్ని గంటల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్మార్చ్ ప్రారంభం కానుండగా ముఖ్యనేతల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు బహిర్గతమయ్యాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి పరస్పరం కత్తులు నూరుతూ ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణ ఉల్లంఘనపై ఫైవ్మెన్ కమిటీ నివేదిక ఆధారంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు జనగామ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ గురువారం ప్రకటించారు.
కొమ్మూరి వర్గీయులు కొందరు నా యకులు సమావేశమై పార్టీని భ్రష్ఠుపట్టిస్తున్న పొన్నాలను తామే కాంగ్రెస్ నుంచి తొలగించామని స్పష్టం చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కొ మ్మూరి.. అధికార పార్టీకి కోవర్టుగా ఉన్న పొన్నాలకు మతిభ్రమించిందని ఆరోపించారు. ఆయన్ను ఎర్రగడ్డ దవాఖానలో చేర్పించాలనడంతో ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు పరస్పర నిందారోపణలకు దిగ డం పార్టీలో రచ్చకు దారితీసింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనగామ కాంగ్రెస్ రెండు వర్గాలు, నాలుగు గ్రూపులుగా విడిపోవడం గమనార్హం. టీపీసీసీ మా జీ చీఫ్ పొన్నాల, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జంగా అనుచరులు ఎవరికి వారే అన్నట్టుగా జట్టుకట్టి ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతో పార్టీ నవ్వులపాలవుతున్నదని కార్యకర్తలు వాపోతున్నారు.