సూర్యాపేట : పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సుమారు రూ. 12 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ విస్తరణ ,అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఎస్ఈ మల్లికార్జున్ రెడ్డి అందుకు సంబంధించిన నమూనాలను సిద్ధం చేశారు. మంగళవారం మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి, యాదాద్రి ఆలయ శిల్పి ఆనందసాయి స్థపతి వల్లియనాగన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఈ మల్లికార్జున్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వేణు అయ్యగారు తదితరులు ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ నెల 23 న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి రాకను పురస్కరించుకుని అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.