బొడ్రాయిబజార్: ఆ వార్డు ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమ కాలనీకి ఓ మంచి రోడ్డు కావాలని కంటున్న కలలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసింది. శివారు కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మున్సిపల్ పాలకవర్గం రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో ఎక్కడికక్కడ సమస్య లు పరిష్కరిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 17వ వార్డులోని కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డుకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై 17వ వార్డు ప్రజలు గత ప్రభుత్వాల హాయంలో ప్రజాప్రతినిధు లు, అధికారులకు సమస్యను విన్నవించినప్పటికి ఏ ఒక్కరూ పట్టించు కోలేదు.
వ్యవసాయ మార్కెట్కు వచ్చే భారీ వాహనాలతో అంతంతమాత్రంగా ఉన్న రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడడంతో పాటు దుమ్మూదూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబేద్కర్నగర్ ప్రజలు పట్టణంలోకి రావాలంటే ఈ దారి గుండానే రావాల్సి ఉంటుంది. దాదాపు రహదారి మొత్తం గుంతలమయంగా మారడంతో పట్టణంలోకి వెళ్లాలంటే తలకు మించిన భారంగా మారేది.
తమ కాలనీ రోడ్డు బాగైతే బాగుండు అన్న ఆశ అడియాశ అవుతున్న వేళ సూర్యాపేట మున్సిపల్ పాలకవర్గం వారి కోరికను నేరవేర్చింది. రోడ్డు విషయమై 17వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన చింతలపాటి భరత్మహజన్ సమస్యను విన్నవించగా మంత్రి జగదీష్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణల సహకారంతో మున్సిపల్ సాధారణ నిధులు రూ 37 లక్షలతో 17వ వార్డులోని మూసీ కెనాల్ నుంచి అంబేద్కర్నగర్ వరకు రోడ్డు పనులను చేపట్టారు.
ప్రస్తుతం పనులు ముమ్మరంగా జరుగుతుండగా కొద్దిరోజుల్లోనే అంబేద్కర్నగర్ వాసులకు, వాహనదారుల, రైతులకు రోడ్డు సమస్య నుంచి విముక్తి లభించనుంది. గత పాలకుల హయాంలో ఎన్నోమార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించు కోలేదని నేడు మంత్రి జగదీష్రెడ్డి సహకారంతో నూతనంగా సీసీ రోడ్డు నిర్మించ డం పట్ల కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు మా కలను నెరవేర్చిన మంత్రికి, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ భరత్ మహజన్లకు ఎల్ల వేళలా రుణపడి ఉంటామంటున్నారు.