తూప్రాన్/మర్కూక్, ఆగస్టు 26 : గ్రామకంఠంలోని భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం డ్రోన్ ద్వారా సర్వేకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సర్వేను ప్రారంభించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి డ్రోన్ కెమెరాల ద్వారా సర్వే నిర్వహించారు. ఇండ్లు, ఖాళీ స్థలాలు, రోడ్లను అధికారులు 10 భాగాలుగా విభజించారు. 40 ప్రదేశాల్లో మార్కింగ్ చేసి సర్వే చేశారు. ఈ సర్వేను అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించారు. కాగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని అంగడి కిష్టాపూర్లో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్వెస్లీ డ్రోన్ ద్వారా సర్వేను ప్రారంభించారు.