హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ)/కవాడిగూడ: పత్రికా సంపాదకుడిగా, రచయితగా, పండితుడిగా, పరిశోధకుడిగా, రాజకీయ చైతన్యశీలిగా సురవరం ప్రతాపరెడ్డి సేవలు చిరస్మరణీయమని ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. సాంఘిక చైతన్యానికి ఆయన నిలువెత్తు స్ఫూర్తి అని పేర్కొన్నారు. సురవరం 127వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ట్యాంక్బండ్పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భాషా, సాహిత్యం, సాంసృతిక పునరుజ్జీవనానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు కవి అని వివరించారు. తొలిసారి వనపర్తి ఎమ్మెల్యేగా ఎన్నికై కేవలం ఏడాదిలోనే సురవరం కన్నుమూశారని చెప్పారు. ఆయన రచనలను రెండు సంపుటాలుగా తీసుకొచ్చామని, మూడో సంపుటాన్ని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తీసుకొస్తామని వెల్లడించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు, వనపర్తి నియోజకవర్గానికి ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి సాహితీ వైజయంతి ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఎ ల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి జే చెన్న య్య, కార్యదర్శి సురవరం పుష్పలతారెడ్డి, కోశాధికారి డాక్టర్ సురవరం కృష్ణవర్ధన్రెడ్డి, ట్రస్ట్ సభ్యులు విష్ణువర్ధన్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి, కపిల్ తదితరులు పాల్గొన్నారు.