హైదరాబాద్, జూలై 10: వైద్య సేవలు అందిస్తున్న సురక్ష క్యూఆర్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గత నాలుగు నెలల్లోనే 27 వేల మంది సబ్స్ర్కైబర్లు చేరగా, వచ్చే మార్చి నాటికి 5 లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నది.
ప్రస్తుతం తెలంగాణతోపాటు ఏపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో సేవలు అందిస్తున్న సంస్థ..త్వరలో తమిళనాడు, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్ రాష్ర్టాల్లో సేవలు ప్రారంభించనున్నట్టు సురక్ష క్యూఆర్ సీఈవో విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.