హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విపత్తు నిర్వహణ సహాయ నిధులను (ఎస్డీఆర్ఎఫ్) పర్సనల్ డిపాజిట్ అకౌంట్లకు బదిలీ చేయడంపై ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేలు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్ని రాష్ట్రాలకు ఎన్డీఎంఏ మార్గదర్శకాలు పంపింది. ఏపీ సర్కారు ఆ నిధులను పకదారి పట్టించినట్టు విచారణ సందర్భంగా పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ నిధులు బదిలీ చేసి ఉంటే.. వాటిని ఇతర ఏ అవసరాలకు వినియోగించవద్దని ధర్మాసనం ఆదేశించింది.