హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కృష్ణమోహన్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆ నోటీసులలో పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దాంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించినట్లయింది. కాగా, తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు ఇప్పటికే డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు గెజిట్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు కూడా ఇచ్చింది. కాగా, ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని డీకే ఆరుణ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.