Justice Lokur | హైదరాబాద్ : విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు సీజేగా ఆయన పని చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా జస్టిస్ లోకూర్ సేవలందించారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్టు సుప్రీంకోర్టుకు జస్టిస్ నరసింహా రెడ్డి లేఖ పంపారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం సమయం ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించొచ్చని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ లోకూర్ను ప్రభుత్వం నియమించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిషన్ విచారణను సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు జులై 16న ఉదయం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా, కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు.
ఇవి కూడా చదవండి..
Manu Bhaker: చరిత్ర సృష్టించిన మహిళా షూటర్.. మనూ భాకర్పై ప్రశంసల వర్షం
Telangana Assembly | అసెంబ్లీని ముట్టడించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు.. అరెస్టు చేసిన పోలీసులు