Supreme Court | తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొనసాగుతున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం దర్యాప్తు కొనసాగిస్తారని న్యాయవాదులను ధర్మాసనం ప్రశించింది. నిందితుడు ప్రభాకర్రావు దర్యాపునకు సహకరించడం లేదని.. ఐదు ఐఫోన్ల పాస్వర్డ్లో.. కేవలం రెండు ఫోన్ల రీసెట్కు మాత్రమే ఆయన సహకరించారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.
ఆ రెండింటిలో ఎలాంటి డేటా లేదని.. మరో మూడు ఐడీలో ఓపెన్ కాలేదని చెప్పారు. ప్రభాకర్ రావు సహకరించడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. ఇంకా ఏం డేటా కావాలని కోరుకుంటున్నారని సుప్రీంకోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. ఆ తర్వాత కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఫోన్ టాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషప్ను జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారించింది. ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ కల్పించి.. దర్యాప్తుకు సహకరించాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.