మోర్తాడ్/భీమ్గల్, సెప్టెంబర్ 9: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కుల సంఘాల మద్దతు రోజురోజుకూ పెరుగుతున్నది. భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంలో గంగపుత్ర వడ్డెర సంఘం సభ్యులు, బాల్కొండ మండలం నాగాపూర్కు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన 14 కుటుంబాలు, సరికెల వారి మున్నూరుకాపు సంఘానికి చెందిన 28 కుటుంబాలు, ఆదివాసి నాయక్పోడు సంఘానికి చెందిన 22 కుటుంబాలు, మోర్తాడ్ మండలం దోన్పాల్లో గంగపుత్ర సంఘానికి చెందిన 41 మంది, యాదవ సంఘం సభ్యులు 35 మంది, దళిత సంఘం సభ్యులు 30, మాల సంఘానికి చెందిన 20 మంది రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ఉంటామని తీర్మానం చేశారు. అనంతరం ఆ ప్రతులను స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా కులసంఘాల సభ్యులు మాట్లాడుతూ.. తమ గ్రామంతోపాటు బాల్కొండ నియోజకవర్గంలో ఏనాడు ఏ నాయకుడు చేయని అభివృద్ధి పనులను మంత్రి వేముల చేశారని తెలిపారు.