మోర్తాడ్, అక్టోబర్ 20 : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఈ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని మోర్తాడ్ శాలివాహన కుమ్మరి సంఘానికి చెందిన 30 కుటుంబాల వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ తీర్మాన పత్రాన్ని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, సర్పంచ్ బోగ ధరణిలకు శుక్రవారం అందజేశారు.