నల్లగొండ : మెడికల్ బిల్లులు చెల్లించడానికి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ నల్లగొండ(Nallagonda) ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్(Superintendent) లచ్చునాయక్ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న అనే వ్యక్తికి బిల్లులు చెల్లించేందుకు సూపరింటెండెంట్ను కలిశాడు. అందుకు మూడు లక్షలు డిమాండ్ చేశాడు.
బాధితుడు చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం లచ్చు నాయక్ ఇంట్లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.