హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అంతకు ముందు సచివాలయంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆరో అంతస్తులోని సీఎం చాంబర్కు వెళ్లారు. అక్కడ సీఎంతో వారిద్దరూ సమావేశమయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 50 రోజులు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయం, సునీల్ కనుగోలు టీమ్ సేకరించిన ఫీడ్ బ్యాక్ను సీఎంకు వివరించినట్టు సమాచారం. ఆరు గ్యారంటీలపై వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. లోక్సభకు గడువుకు ముందే ఎన్నికలు జరుగనున్నాయన్న సమాచారంతో రాష్ట్రంలో ఎన్నికల వ్యూహంపై కూడా వీరు చర్చించినట్టు తెలిసింది.