హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుక్కెడు నీటి కోసం పుట్టెడు కష్టాలు పడిన చరిత్ర ఉండేదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సకల జనుల తాగునీటి కష్టాలను శాశ్వతంగా, సమూలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చేశారని తెలిపారు. దశాబ్ది దినోత్సవాల్లో భాగంగా ఆదివారం జల దినోత్సవం- మంచినీళ్ల పండుగ సందర్బంగా కేటీఆర్ ట్వీట్ చేశారు.
నాడు గుకెడు తాగునీటి కోసం పుట్టెడు కష్టాలు.. ఖా ళీ బిందెలతో కిలోమీటర్ల ప్రయాణాలు వాటర్ ట్యాంకర్ల సాక్షిగా నీటియుద్ధాలు ఫ్లోరైడ్ భూతంతో వంగిన నడుములు జీవచ్ఛవాలుగా మారిన మనుషులు చిలుముపట్టిన నీళ్లతో చెలగాటాలు
కలుషిత నీటితో సీజనల్ జ్వరాలు
ఒకటా.. రెండా..సమైక్యపాలకుల పాపానికి..దశాబ్దాలపాటు దూపకేడ్చింది తెలంగాణ నేడు.. సకల జనుల తాగునీటి కష్టాలను శాశ్వతంగా..సమూలంగా తీర్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పబలం మిషన్ భగీరథ అనే ఒకే ఒక మహాయజ్ఞం.
దేశంలోని మిగతా రాష్ట్రాలను మెప్పించి ఒప్పించిన పథకమిది..కేంద్ర ప్రభుత్వమే కాపీకొట్టిన.. హర్ ఘర్ జల్ కు
నిలువెత్తు స్ఫూర్తి ఇది.
దేశ చరిత్రలో.. ఎన్నికల హామీలు గాలిలో దీపాలవుతున్న వేళ ఇంటింటికీ నీళ్లు ఇయ్యకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగం
అన్న ధైర్యం కేవలం ధీరోదాత్తమైన నాయకత్వానికి మాత్రమే సాధ్యమైన సాహసం ఇది.
పల్లెలు.. పట్నాలు.. కొండ కోనల్లో..తడారిన గొంతుల్లో.. గోదావరి పరవళ్లు గమ్యాన్ని ముద్దాడిన విజన్కు సజీవ సాక్ష్యాలు
నల్లగొండ గుండెపై నుంచి ఫ్లోరైడ్ బండను దశాబ్ద కాలంలోనే నిర్మూలించిన మేధోమథనం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో
లిఖించే సరికొత్త అధ్యాయం.
బంజారాహిల్స్ వాసులు తాగే స్వచ్ఛమైన నీటినే బస్తీల్లో నివసించే పేదలకు కూడా అందించడమంటే..
మంచినీటిని ప్రజల ప్రాథమిక హకుగా ప్రభుత్వం గుర్తించడమే. ఏండ్ల నాటి తాగునీటి తండ్లాటను.. ఆడబిడ్డల అష్టకష్టాలను తీర్చడంలో ఉద్యమస్ఫూర్తితో కదంతొకిన ప్రతిఒకరికి దశాబ్ది ఉత్సవాల వేళ హృదయపూర్వక శుభాకాంక్షలు.