మహబూబాబాద్ : కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. గురువారం మహబూబాబాద్ నియోజకవర్గం గూడూరు మండలం లోని మర్రిమిట్టా గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్, పార్టీలకు చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. గ్రామస్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని వెల్లడించారు. కొత్త ,పాత తేడా లేకుండా అందర్నీ గుండెల్లో నిలుపుకుంటానని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పటిష్టతకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.