Suicide | వెంగళరావునగర్, జూన్ 28: ‘సర్’ జాబితాలో తన పేరు లేదనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్ లంబగుండు ప్రాంతంలో చోటు చేసుకున్నది.
మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. భరత్నగర్కు చెందిన షేక్ ముజీబుర్ రహ్మాన్(51) కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఎస్ఐఆర్ లిస్టులో పేరు లేకుంటే తనను జైలుకు పంపుతారేమోనని ఆందోళన గురయ్యాడు. తన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారని తీవ్రంగా మదనపడ్డాడు. ఈ విషయమై శనివారం రాత్రి భార్య ఇస్మాయిల్బీ ఎంత నచ్చజెప్పినప్పటికీ మనస్తాపం వీడలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఇంటి బయట ఉన్న షెడ్డు ఇనుప రాడ్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.