హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం ముగ్గురు అధికారులతో సబ్కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమి టీ ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. ఈ సబ్కమిటీకి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ చైర్మన్గా వ్యవహరిస్తారు. సభ్యులుగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆం ధ్రప్రదేశ్ ఫైనాన్స్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ ఉంటారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్లో హాజరుకావాలని మీటిం గ్ నోటీసులను ఇరు రాష్ర్టాలకు కేంద్రం అందజేసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, విద్యుత్తు సమస్యలు, బ్యాంక్ డిపాజిట్ల పంపకాలు, పౌరసరఫరాల సంస్థకు చెందిన క్యాష్ క్రెడిట్ సమస్యలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు, టాక్స్ ఇన్సెంటివ్స్, స్పెషల్ క్యాటగిరీ స్టేట్ అంశాలపై చర్చించనున్నారు.