జూబ్లీహిల్స్, జనవరి24: వ్యవసాయ వర్శిటీ భూముల వ్యవహారంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటనపై పోలీసులు స్పందించారు. విద్యార్థినిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనలో సంబందిత సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు విచారణ జరుపుతామని వెల్లడించారు. ఈ మేరక కొందరు పోలీసు సిబ్బంది అనుచిత చర్యలకు సంబంధించిన వీడియోలు సైబరాబాద్ పోలీసుల దృష్టికి వచ్చినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వ్యవహారంపై తగిన చర్యలు చేపట్టేందుకు సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు.