కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 18 : కొత్తగూడెం(Kothagudem) మెడికల్ కళాశాల(Medical College) ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు తమను వేధిస్తున్నారని, అర్ధరాత్రి వసతి గృహాలకు వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సోమవారం సుమారు 300 మంది మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్లో సరైన తాగునీటి వసతి లేదని, ఫుడ్ మెనూ అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు తక్షణం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేందంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.