గూడూరు: దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను గౌరవించుకోవడం దేశ ప్రజలుగా మన బాధ్యత. శుక్రవారం రైతు దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాటీమీద తండాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రైతులకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులకు ఉపాధ్యాయుడు గోపీనాథ్తో కలిసి విద్యార్థులు సెల్యూట్ చేశారు. రైతులను పూలమాలతో సత్కరించి, నమస్కరించారు.