హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థులు పటాకులు కాల్చి, సంబురాలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు విద్యార్థులు, నిరుద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఉద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వయో పరిమితి పెంచడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.