హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకొన్న 2,500 మందికి పైగా విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలను అమెరికన్ కాన్సులేట్ నిర్వహించింది. మంగళవారం యూఎస్ మిషన్ ఇన్ ఇండియాలో భాగంగా హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్లో స్టూడెంట్ వీసా డేను ఘనంగా నిర్వహించారు. యూఎస్ ఎంబసీ చార్జ్ లాసిన మాట్లాడుతూ ఈ ఏడాది 2 లక్షలకు పైగా భారత విద్యార్థులు అమెరికా విద్యాసంస్థల్లో చేరినట్టు తెలిపారు.
అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారత విద్యార్థులే 20 శాతం వరకు ఉంటారని చెప్పారు. మెజార్టీ విద్యార్థులకు వీసా మంజూరవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అమెరికాలోని కాలేజీలు, యూనివర్సిటీలు, అడ్మిషన్ల వివరాలకు educationusa.state.gov ను సంప్రదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్కతా కాన్సులేట్స్ పాల్గొన్నారు.