ఆదిలాబాద్ : ఆదిలాబాద్(Adilabad) రూరల్ మండలం మామిడి గూడ(Mamidiguda) ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మహేశ్వరి అనే విద్యార్థి రిమ్స్లో(Rims) చికిత్స పొందుతూ మృతి(Student died) చెందింది. అయితే విద్యార్థిని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ రిమ్స్ ఎదుట ఆదివాసీ సంఘాల నాయకులు, స్థానికులు రాస్తారోకో చేపట్టారు.
ఆశ్రమ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని అస్వస్థతకు గురైందని వివిధ సంఘాల నాయకులు ఆరోపించారు. బాలిక ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన హెడ్ మాస్టర్, ఏటీడీవోలను సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానికుల ఆందోళనతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులను శాంతిపంజేశారు.