సిద్దిపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటోలో నుంచి జారిపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుబ్బాక మండలంలోని దుబ్బాక -లచ్చపేట రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..దుబ్బాక వంద పడకల దవాఖానలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న గన్నె లింగారెడ్డి కుమారుడు హరీశ్వర్ రెడ్డి (12) లచ్చపేట మోడల్ స్కూల్లో చదువుకుంటున్నాడు.
కాగా, రోజువారీలాగే పాఠశాలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా.. ప్రమాదవశాత్తు మార్గమధ్యలో ఆటో లో నుంచి జారిపడి మృతి చెందాడు. హరీశ్వర్ రెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.