TSRTC | హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యార్థులందరికీ టీఎస్ ఆర్టీసీ వివిధ రకాల బస్పాస్లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. రాయితీతో కూడిన బస్ పాస్ను అధికారులు విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వేలాది మంది విద్యార్థులు రాయితీ బస్ పాస్లతో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. అయితే.. ఈ విద్యార్థులంతా ప్రతినెల బస్ పాస్ రెన్యూవల్ కోసం.. ఆయా కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ఆర్టీసీ అధికారులు రెన్యూవల్ పాస్లను ఆన్లైన్లోనే పొందేలా చర్యలు తీసుకున్నారు.
మరి ఆన్లైన్ ద్వారా కొత్త బస్ పాస్కు ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా రెన్యూవల్ చేసుకోవాలి? అప్లికేషన్ స్టేటస్ ఎలా చూసుకోవాలి? అంటే.. మొదటగా https://online.tsrtcpass.inలో TSRTC బస్ పాస్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. అప్పుడు మీరు ‘Apply’ బటన్పై క్లిక్ చేసి.. మీ జిల్లాను ఎంచుకోవాలి. అనంతరం ‘Passes for School Students’ అనే సెక్షన్ను ఎంచుకొని అప్లై అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో.. నిబంధనలు చదివిన తర్వాత.. Apply బటన్పై క్లిక్ చేస్తే.. బస్ పాస్ అప్లికేషన్ ఫామ్.. స్క్రీన్పై కనిపిస్తుంది. ఇప్పుడు విద్యార్థి వివరాలు, ఇంటి అడ్రస్, పాఠశాల వంటి వివరాలను నమోదు చేయాలి. రూట్ వివరాలను కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డ్రాప్-డౌన్ మెనూ నుంచి “చెల్లింపు మోడ్ & పాస్ కలెక్షన్” ఎంచుకోవాలి. మీరు నమోదు చేసిన వివరాలను మరోసారి ధ్రువీకరించుకొని ఆపై “Submit” బటన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ బస్ పాస్ డబ్బు చెల్లింపు చేయాలి. డబ్బు చెల్లింపు పూర్తయిన తర్వాత.. టీఎస్ ఆర్టీసీ బస్ పాస్ మంజూరు అవుతుంది. ఈ దరఖాస్తు ఫారాన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అందులో.. పాస్ ఎప్పుడు వస్తుందనే డేట్ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ సమయానికి బస్ పాస్ అందుతుంది.