ములుగు : ఎయిడ్స్ రహిత సమాజానికి పాటుపడాలని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు అవగాహన ర్యాలీని మంత్రి కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రజలు వైద్యాధికారుల సూచనలు పాటిస్తూ ఎయిడ్స్ నియంత్రణకు సహకరించాలన్నారు. ఎయిడ్స్ బారిన పడి జీవితాలను ఆగం చేసుకోవద్దని మంత్రి సూచించారు. అనంతరం రక్తదాన శిబిరాలలో పాల్గొన్న విద్యార్థులకు రక్త దాతలకు ప్రశంసాపత్రాలను అందించారు.