Karnataka Elections | న్యాల్కల్ : కర్ణాటకలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నుంచి డబ్బు, మద్యం తరలించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేష్, హద్నుర్ ఎస్ఐ వినయ్ కుమార్ స్పష్టం చేశారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని మెటల్కుంట, రాజోల రైల్వే స్టేషన్లను రైల్వే అధికారులు పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు. మెటల్కుంట రైల్వే స్టేషన్లో బీదర్కు వెళ్తున్న రైలును ఆపి పలు బోగీల్లో తనిఖీలు చేపట్టారు. ఈనెల 10వ తేదీన కర్ణాటకలో జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అక్కడి ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం తరలించకుండా తనిఖీలు చేపట్టామని రూరల్ సీఐ వెంకటేష్, స్టేషన్ మాస్టర్ హెచ్ఎస్ మీనా తెలిపారు.