హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా), డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ నేతలు సచివాలయంలో సీఎంను కలిశారు. గ్రామ రెవెన్యూ పరిపాలన వ్యవస్థను పునర్నిర్మించాలని కోరారు. వివిధ శాఖల్లో క్రమబద్ధీకరించబడిన వీఆర్ఏలకు ఎంప్లాయ్ ఐడీలు కేటాయించి వేతనాలు చెల్లించాలని, వయసు పైబడిన, మరణించిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని విన్నవించారు. తమ విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించారని అసోసియేషన్ల బాధ్యులు తెలిపారు. సీఎంను కలిసినవారిలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, నిరంజన్రావు, అన్వర్, మాధవీరెడ్డి, కార్యదర్శులు మనోహర్ చక్రవర్తి, పల్నాటి శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీ లచ్చిరెడ్డి, కే రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్సింగ్ హాన్ తదితరులు ఉన్నారు.