ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లిలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ మచ్చల జింకపై దాడి చేసి చంపాయి. సత్తుపల్లి అర్బన్ పార్క్ ఏరియాకు సమీపంలోని జలగం నగర్ కాలనీలోకి ఓ మచ్చల జింక మంగళవారం ఉదయం వచ్చింది. దీంతో వీధి కుక్కలు జింకను చుట్టుముట్టి దాడి చేశాయి.
దీంతో తీవ్ర గాయాలపాలైన జింక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం వెటర్నరీ హాస్పిటల్కు జింక కళేబరాన్ని తరలించారు.