Telangana | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి స్టోన్ క్రషర్లు మూతపడడంతో కంకర కష్టాలు మొదలయ్యాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్కు కొరత ఏర్పడి నిర్మాణరం గం స్తంభించిపోయింది. రోడ్డు పను లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రాయల్టీని భారీగా పెంచడడం, కొత్త నిబంధనల పేరు తో వేధింపులకు దిగడం, దీన్ని నిరసిస్తూ క్రషర్ల యజమానులు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో బహిరంగ మార్కెట్లో కంకర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంకరపై రాయల్టీని ప్రతి టన్నుకు 250 నుంచి 395కి పెం చింది. ఇందులో పర్మిట్ ఫీజు పేరుతో కొత్తగా 58 చొప్పున వసూ లు చేస్తున్నది. దీంతో గతంలో 600కు లభ్యమయ్యే టన్ను కంకరకు ఇప్పుడు రవాణా ఖర్చులు కలుపుకొని వినియోగదారుడు 1,000 వరకు చెల్లించాల్సి వస్తున్నది. మరోవైపు మైనింగ్ అధికారులు అడ్డగోలుగా తమపై దాడులు నిర్వహిస్తూ అనుమతులను రద్దు చేయడంతోపాటు భారీగా పెనాల్టీలు విధిస్తున్న ట్లు క్వారీలు, క్రషర్ల యజమానులు వాపోతున్నారు.
నిలిచిన రోడ్ల నిర్మాణం
రాష్ట్రవ్యాప్తంగా క్రషర్లు బంద్ కావడంతో కంకర సరఫరా ఆగిపోయింది. దీంతో రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయా యి. కంకరతోపాటు ఇతర సామగ్రి ధరల పెరుగుదలకు అనుగుణంగా తమకు చెల్లింపులు జరిపేందుకు అధికారులు ఒప్పుకుంటేనే పనులు కొనసాగిస్తామని, లేకుంటే తమకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. కంకర, ఇసుక, రోబో శాండ్ ధరల పెరుగుదలతో నిర్మాణ రంగం స్తం భించింది. గతంలో 1,000కి లభ్యమైన టన్ను ఇసుక.. ఇప్పుడు 2,500 నుంచి 3 వేల వరకు పలుకుతున్నది. డీజీపీఎస్, ఈటీఎస్ విధానాలతో ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలని కోరు తూ తెలంగాణ క్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్ సోమవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం ఇచ్చింది.