Bhadrachalam | భద్రాద్రి రాముల వారి కల్యాణం, పట్టాభిషేక మహోత్సవ వేడుకలకు ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేస్తామని భద్రాద్రి దేవస్థానం అధికారులు చెప్పారు. వచ్చేనెల 17న సీతారాముల కల్యాణం, 18న మహా పట్టాభిషేక వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేక వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఈ నెల 25 నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు వేడుకల్లోనూ పాల్గొనాలని భావించే భక్తులు ముందుగానే ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపారు.