హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్20 (నమస్తే తెలంగాణ): నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామ పరిధిలోని చారిత్రక, పురావస్తు మెన్హిర్ల(నిలువురాళ్లు)కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ సాధించే దిశగా ముందడుగు పడింది. ఇప్పటికే చారిత్రక మెన్హిర్ల(నిలువురాళ్లు) అధ్యయనం, డాక్యుమెంటేషన్, వాటి పరిరక్షణ కోసం డక్కన్ అకాడమీ హెరిటేజ్ ట్రస్ట్ (డీహెచ్ఏటీ)తో రాష్ట్ర వారసత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ మేరకు డీహెచ్ఏటీ ముడుమాల్లోని పురావస్తు, చారిత్రక మెన్హిర్ల అధ్యయనం, డాక్యుమెంటేషన్, సంరక్షణ చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మంగళవారం వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా డీహెచ్ఏటీ బృందం, తె లంగాణ హెరిటేజ్ శాఖ ఇప్పటికే పలుమార్లు నారాయణపేట జిల్లా యంత్రాంగం సహకారంతో మెన్హిర్లు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించినట్టు మంత్రి తెలిపారు.