హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): యావత్ దేశానికి తెలంగాణ మా డల్ అవసరమని డెన్మార్క్ ఎన్నారైలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజనీతిజ్ఞత, మార్గదర్శకత్వం అన్ని రాష్ట్రాలకు అవసరమని పేర్కొంటున్నారు. అందుకోసం ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ప్రధాని కావడం ద్వారానే ఈ దేశం వ్యవసాయం సహా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, సంక్షేమ ఫలాలు యావత్ జాతికి దక్కుతాయని పేర్కొన్నారు. మతోన్మాద కేం ద్రం మెడలు వంచాలని, దేశమంతా సామరస్యాన్ని వర్ధిల్లజేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణలో అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నది. తెలంగాణలో చేపడుతున్న పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి సాధించిన తెలంగాణను అనతికాలంలోనే దేశమంతా ఆదర్శంగా చూసేలా తీర్చిదిద్దిన కృషిని చూస్తూ అబ్బుర పడుతున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోతుంటే.. కనీస సదుపాయాలు అందివస్తుంటే.. తెలంగాణ పల్లెలు అభివృద్ధితో అలరారుతున్నాయి. కేసీఆర్ విజన్తో పరిపాలనలో తొలిమెట్టయిన గ్రామ పంచాయతీలు అసలు సిసలైన భూమిక పోషిస్తుండగా సర్పంచులు విధి నిర్వహణలో క్రియాశీలపాత్ర పోషించగలుగుతున్నారు. ఈ విజన్నే నేడు ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.
– మీర్జా అశ్వక్ బేగ్, ఐటీ కన్సల్టెంట్ (డెన్మార్)
తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధి, కార్మిక, పెన్షనర్ల వంటి సబ్బండ వర్గాలను ఏకం చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రా పాలకులలు చేసిన అన్యాయాలను ఎదురిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన గొప్ప ఉద్యమకారుడు కేసీఆర్. ఇదే స్ఫూర్తితో కేంద్రం మెడలు వంచాలి. తెలంగాణపై కేంద్ర వివక్షను ఎదురిస్తూ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.విద్యుత్తు, వ్యవసాయం, నీటిపారుదల వంటి రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి కేసీఆర్ కార్యదక్షతను సూచిస్తున్నాయి. ఈ రంగాలపై తనదైన విధానాలతో ముందుకుపోయిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే.. అకడ కూడా చకటి మార్పులకు శ్రీకారం చుట్టే వీలుంది.
– రాజారెడ్డి గడ్డం, సాఫ్ట్వేర్ ఇంజినీర్, (డెన్మార్)
స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి మార్గదర్శనం చేస్తున్నది. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎన్నారైలు రావాల్సిందేనని కోరుతున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర పన్నుతున్న బీజేపీకి బుద్ధి చెప్పే సత్తా ఒక కేసీఆర్కే ఉన్నదని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ మాడల్ దేశానికి అత్యవసరమంటూ.. నవ భారత నిర్మాణం కేసీఆర్తోనే సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. అలుపెరుగని పోరాట స్ఫూర్తితో దేశ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని చెప్తున్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలుచేస్తున్న పథకాలు దేశమంతటా అందితే ఆయా వర్గాలు అభివృద్ధిలోకి వస్తాయి. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి.
– పడాల.సాయిగౌడ్, లీడ్ అజుర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆరిటెక్ట్