హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలకు నయా పైసా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వతహాగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవడాన్ని ఓర్వలేక బీజేపీ నాయకులు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
రెండు దశల్లో తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయలేదని స్వయంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ రాసిన లేఖ ప్రతిని ఆయన విడుదల చేశారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినంత మాత్రాన డబ్బులిచ్చినట్టు కాదని.. పైసలు ఇవ్వడానికి, పర్మిషన్ ఇవ్వడానికి తేడా తెలియని అజ్ఞాని అర్వింద్ అని ధ్వజమెత్తారు.