హైదరాబాద్, అక్టోబరు 8 (నమస్తే తెలంగాణ): ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన సీఎం కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ అనుబంధ తెలంగాణ ఆటో, మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. ఆటోడ్రైవర్ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. రోడ్డు పన్ను రద్దు, రూ.5 లక్షల ప్రమాద బీమా వంటి పథకాలను అమలు చేశారని తెలిపారు.
గతంలో ఏ ప్రభుత్వమూ ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించలేదని, సీఎం కేసీఆర్ మావనవతా దృక్పథంతో ఆలోచించారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆటో డ్రైవర్లు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, నాయకులు పాండునాయక్, శాతం రమేశ్, నిరంజన్, వాజిద్భాయ్, శ్రీనివాస్, బాలనర్సింహ, ప్రదీప్కుమార్, సీహెచ్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.