హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మవారపల్లి సీతారామ ప్రాజెక్టు(Sitarama project) పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుంచి పనులను పరిశీలించారు. అనంతరం వ్యూ పాయింట్ వద్ద సాగునీటి అధికారులు ఏర్పాటుచేసిన సీతారామ ప్రాజెక్ట్ ఫొటో ప్రజెంటేషన్ను తిలకించారు. పంప్ హౌస్ పనులను సైతం పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన సీతారామ ప్రాజెక్టు పనులను సాగునీటి పారుదల శాఖ అధికారు మంత్రులకు వివరించారు.