హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని ఈ నెల 12న సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో రాష్ట్రస్థాయి మహిళా సదస్సును నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల సభ్యులతో నిర్వహించే ఈ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.
ఈ నేపథ్యంలో పరేడ్గ్రౌండ్లో చేసే సభా ప్రాంగణం, పారింగ్ తదితర ఏర్పాట్లపై శాంతికుమారి శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో సమీక్షించారు. టెలీకాన్ఫరెన్స్లో డీజీపీ రవిగుప్తా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు.