హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో గురువారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 8.45 గంటలకు మాదాపూర్ నాలెడ్జ్ సిటీలో గోల్డ్మెన్ సాచ్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. 10.30 నుంచి 11 గంటలకు కొత్తూర్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 11.15 గంటలకు షాద్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించి, బంజారా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
అనంతరం షాద్నగర్ మార్కెట్ యార్డులో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యా హ్నం ఒంటిగంటకు రావిర్యాలలో విజ య మెగా డెయిరీని ప్రారంభిస్తారు. 2.30గంటలకు వికారాబాద్ జిల్లా కేం ద్రంలో గిరిజన భవన్, రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు కూకట్పల్లి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం కేపీహెచ్బీలోని కేటీఆర్ పార్కులో జరిగే సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.