హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతున్నది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గాంధీభవన్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్మున్షీతోపాటు ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నిర్వహిస్తున్న తొలి కార్యవర్గ సమావేశం ఇదే. ఇందులో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, లోక్సభ ఎన్నికల వ్యూహరచనతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నారు.