యాదాద్రి, డిసెంబర్ 15 : యాదగిరిగుట్ట ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు నడిపల్లి ఆనందరావు రూ.1,50,318 విరాళం అందజేశారు.
గురువారం కుటుంబ సమేతంగా యాదగిరీశుడి సన్నిధికి చేరుకున్న ఆయన మొదటగా స్వయంభూ నారసింహుడిని పూజలు జరిపారు. ముఖ మండపంలో రూ.50,202 నగదు, రూ.1,00,116 చెక్కును ఆలయ ఏఈవో రఘుకు అందజేశారు.