మాదాపూర్, మే 3: సమాజాన్ని జాగృతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నా రు. సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు అండగా ఉం టూ, వారి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన హైబిజ్ టీబీ మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సం క్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నదని చెప్పారు. జర్నలిస్టు లు నిజాన్ని సమాజానికి తెలియజెప్పడంలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా పనిచేస్తున్నారని అన్నారు.
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్నో కష్టాలకోర్చి జర్నలిస్టు నిజాలను సమాజానికి అందిస్తూ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. హైబిజ్ మీడియా వివిధ క్యాటగిరీల్లో 65 మందికి అవార్డులు అందజేసింది. బెస్ట్ ప్రింట్ మీడియా జర్నలిస్టుగా నమస్తే తెలంగాణకు చెందిన గుండాల కృష్ణ, బెస్ట్ కార్టూనిస్ట్గా మృత్యుంజయ్, బెస్ట్ ఫొటోగ్రాఫర్గా గోపి బండగే, బెస్ట్ ప్రింట్ అడ్వర్టెయిజ్మెంట్లో రాజిరెడ్డి, జీఎం సురేందర్రావు, సీనియర్ ఎంప్లాయి రాములుకు మంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్రెడ్డి అవార్డులు అందజేశారు. రెసోనెన్స్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచందర్రావు కళాశాల విద్యార్థులకు రూ.25 వేల స్కాలర్షిప్ను అందించారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి, భారతి సిమెంట్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, క్రెడాయ్ ప్రతినిధి రాజశేఖర్రెడ్డి, పౌల్ట్రీ ఇండియా ప్రతినిధి చక్రధర్రావు, హైబిజ్ టీవీ నిర్వాహకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.