యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణ పరిధిలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఫైనల్ పోటీల్లో మహబూబ్నగర్, మెదక్ జిల్లా హాకీ జట్లు తలపడ్డాయి.
మహబూబ్నగర్ జట్టుకు రెండు పాయింట్లు మెదక్ జట్టుకు జీరో పాయింట్ రావడంతో మహబూబూబ్ నగర్ జట్టు విజేత గా నిలిచింది. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, భారత హాకీ మాజీ కెప్టెన్ ముఖేష్ కుమార్, హాకీ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరై బహుమతులను ప్రధానం చేశారు.
హాకీ పోటీల్లో బెస్ట్ క్రీడాకారులుగా మహబూబ్నగర్కు చెందిన ఎన్ సంతోష్, ద్వితీయ క్రీడాకారుడిగా మెదక్ జట్టు కు చెందిన టి. రాజు, నల్గొండ జిల్లాకు చెందిన పి వినయ్లను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు.
ఇవి కూడా చదవండి..
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు
Road accident | టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి