హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో గత నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్పై బదిలీవేటు వేసింది. వీరితోసహా మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. సర్జరీ చేసిన డాక్టర్పై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నది. ఈ ఘటనపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపిన బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకొన్నది.
క్రమశిక్షణ చర్యల వివరాలు