హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహావిషరణ సమీక్ష అనంతరం సచివాలయ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన ముఖ్యాంశాలు
సత్వరమే గృహలక్ష్మి విధి విధానాలు
ఖాళీ స్థలాలు ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకం అమలుకు సత్వరమే విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమం త్వరలో ప్రారంభించాలని సూచించారు. సత్వరమే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. దళితబంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పారు.