హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంధ ఉపాధ్యాయులు, జూనియర్ అధ్యాపకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రీడర్ అలవెన్స్ను పెంచడంపై బ్లైండ్ ఎంప్లాయీస్ అసొసియేషన్ హర్షం ప్రకటిం చింది. ఈ జీవో ద్వారా ఎస్జీటీ ఉపాధ్యాయులకు 1,200 నుంచి 1,600 వరకు, సూల్ అసిస్టెంట్లకు 1,500 నుంచి 2,000 వరకు, జూనియర్ అధ్యాపకులకు 2,000 నుంచి 2,500 వరకు అలవెన్స్ పెరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు కే మ ల్లేశం, ప్రధాన కార్యదర్శి బీ రాఘవేందర్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే అనిల్ తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్కు వారు ధన్యవాదాలు తెలిపారు.